SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 2:19 pm Posted by : SHIVASURYA NEWS

ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన అనకాపల్లి ఎం.పీ…. సి.ఎం .రమేష్

జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ జరిగిన దుశ్చర్యను తీవ్రంగా ఖండించి,మృతులకు సంతాపం తెలియచేశారు.ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖకు చెందిన చంద్ర మౌళి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసి ఈరోజు రాత్రి విశాఖలో చంద్రమౌళి పార్థివదేహానికి నివాళులర్పిస్తామని తెలియజేశారు.అనకాపల్లి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించి మానవ హారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.