ఉగ్రవాదుల పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు ..ఐసిస్ సానుభూతి పరులు అరెస్ట్

భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌ బృందం‌‌‌‌‌‌‌ భగ్నం చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్(29).. హైదరాబాద్‌ కు చెందిన సమీర్(28).. నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లకు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అభద్రతాభావం మొదలైంది. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే...