SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 12:25 pm Posted by : SHIVASURYA NEWS

అక్రమ తనిఖీలు పై జర్నలిస్టుల నిరసన

మాడుగుల : జయజయహే : సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో గురువారం పోలీసులు ఆకస్మిక అక్రమ తనిఖీలు నిర్వహించడం పట్ల మాడుగుల ప్రెస్ క్లబ్ నిరసన వ్యక్తం చేసింది. మేరకు ఏపీయూడబ్ల్యూజే పిలుపు తో మాడుగుల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ పీ రమాదేవికి గురువారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రతినిధులు రోబ్బ శ్రీనివాసరావు ఏలూరు సురేష్,,కే భవానిశంకర్,పి శ్రీనివాస్,కే నారాయణరావు తదితరులు పాల్గొన్నారు